నంద్యాల సమరం మొదలైంది
నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్లో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయితే ఈ రౌండ్లోనూ టీడీపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. 1634 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కొనసాగుతున్నారు. మొత్తానికి రెండు రౌండ్లు కలిపి టీడీపీ 2816 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కాగా టీడీపీకి- 4726, వైసీపీకి-3126 ఓట్లు పోలయ్యాయి.