నేను 1st ..మోడీ 2nd..ట్రంప్ షాకింగ్ కామెంట్స్..!!!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి సోషల్ మీడియాలో గడపడం అంటే మహా సరదా. తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే సోషల్ మీడియా వేదికగానే ప్రకటిస్తారు. విమర్శలు, అప్లాజులు అన్నీ సోషల్ మీడియాద్వారానే తెలిపే ట్రంప్ అధిక శాతం ట్విట్టర్ లోనే గడుపుతూ ఉంటారు. మోడీ సైతం సందర్భాను సారంగా ట్విట్టర్ లో , ఫేస్ బుక్ ద్వారా ప్రజలకి సందేశాలు ఇస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో అందరికంటే తాను ముందు ఉన్నానని 1st నేనేనని ప్రకటించుకున్నారు, అంతేకాదు ఆ తరువాత 2nd ప్లేస్ లో భారత ప్రధాని మోడీ ఉన్నారని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్నా ప్రపంచ ఆర్ధిక సదస్సు లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది..