టీడీపీ కి బిగ్ షాక్…17 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..???
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ నుంచీ సుమారు 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని ఆయన పెద్ద బాంబు పేల్చారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల ఈ ప్రకటన చేయడంతో ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగిపోయింది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ వస్తున్న విమర్సలేకే చంద్రబాబు కి తలకోట్టేసినట్టుగా బాధపడుతుంటే తాజాగా 17 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారని సజ్జల చెప్పడంతో టీడీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. అంతేకాదు 17 ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎమ్మెల్సీ లు సైతం తమ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని కానీ టీడీపీలా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసే అవసరం జగన్ మోహన్ రెడ్డి గారికి లేదని ప్రకటించారు సజ్జల.