జగన్ “రీ ఎంట్రీ”…డేట్ ఫిక్స్
జగన్ పై దాడి జరిగిన రోజు నుంచీ ఈరోజు వరకూ జగన్ కోల్కొవాలని మళ్ళీ జనాల్లోకి వెళ్లాలని ఎంతో మంది జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. వారం క్రితమే జగన్ పాదయాత్రకి వెళ్లాలని కోరుకున్నా సరే వైద్యుల సలహామేరకు యాత్రని విరమించుకున్నారు. అయితే ఈ దాడి ఘటన నేపధ్యంలో తమ అభిమాన నాయకుడు ఎలా ఉన్నాడో ఇప్పటికి చూసుకోలేదు జగన్ అభిమానులు అయితే
ఈ క్రమంలోనే జగన్ రీ ఎంట్రీ త్వరలోనే అంటూ వైసీపీ నేతలు ప్రకటన చేశారు..గాయం నుంచీ మెల్లమెల్లగా కోలుకుంటున్న జగన్ ఈ నెల 12 నుంచి తన ప్రజాసంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర కోసం ఆదివారంనాడు జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లబోతున్నారని వారు నేతలు తెలిపారు..