మోడీని ఇరకాటంలోకి నెట్టిన ట్రంప్..ఇలా అయ్యిందేంటి..!!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నవంబర్ లో జరగనున్న ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. ఒక పక్క ఎంతో అమెరికన్స్ ని పొట్టనబెట్టుకున్న కరోనా అమెరికాలో ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి ప్రధాన కారణం ట్రంప్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తనపై ఆ నింద తలగించుకుని అమెరికా ఓటర్లకి దగ్గర అవ్వడానికి ట్రంప్ వ్యాక్సిన్ ని ఎరగా వేస్తున్నారు. మరో పక్క
భారతీయ ఓటర్లని మచ్చిక చేసుకోవడానికి ట్రంప్ అంటే తనకి ఎంతో అభిమానమని, ఇద్దరం మంచి స్నేహితులమని, భారత్ అమెరికాకి మిత్ర దేశం అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు ట్రంప్. అయితే కొన్ని రోజుల క్రితం అమెరికాలో జరుగుతున్నా రాజకీయ పరిణామాల గురించి మోడీ తో చర్చలు జరిపిన బీజేపీ పెద్దలు అమెరికా ఎన్నికల్లో ఎక్కడా కూడా బీజేపీ జెండా వాడకూడదని అక్కడి బీజేపీ నేతలకి కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్నటి రోజున
ట్రంప్ ఏకంగా మోడీ ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడంతో బీజేపే నేతలు షాక్ అవుతున్నారు. ఒక వేళ అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వస్తే భారత్ తో బిడెన్ ఎలాంటి స్నేహ భంధాన్ని కొనసాగిస్తాడోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రంప్ మోడీ ఫోటోలను, వీడియోలను వాడేస్తూ ఇరకాటంలోకి నెట్టేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.