బీజేపీ భారీ కుట్ర…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!!
హైదరాబాద్ లో అల్లర్లు జరగేలా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణా రాష్టాన్ని అల్లర్లతో ఉలిక్కిపడేలా చేసేలా బీజేపీ భారీ కుట్ర పన్నుతోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఈ కుట్రలు అమలు కానున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిఈసికి లేఖలు రాశారు. పలు కీలక కార్యాలయాలు ముట్టడి పేరుతో పోలీసులతో లాటీ చార్జ్ జరిగేలా చేసుకునేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు.
ఈ కీలక సమాచారాన్ని ఆ పార్టీకి చెందిన నేతలే తెలిపారని కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుకండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు డీజీపీ కి వినతి పత్రం ఇచ్చారు.